అయిజ: సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నూతన ఒరవడితో వ్యవసాయ పంటలు సాగు చేసి రైతులకు లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో వ్యవసాయ పంటల సాగు విధానం, ఆధునిక వ్యవసాయ యంత్రాల ప్రదర్శనలు చేపట్టేందుకు రైతు మేళా ను ధన్వంతరి వేంకటేశ్వరస్వామి దేవస్థాన కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
అలంపూర్ నియోజకవర్గంలోని 7 మండలాలు, పట్టణాలకు చెందిన 5 వేల మంది రైతులకు రైతు మేళాలో అవగాహన కల్పించనున్నారు. ఇందు కోసం జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ మండలంలోని ఉత్తనూర్ గ్రామంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం వేదిక కానుంది. బుధవారం నిర్వహించ నున్న రైతు మేళాకు ఏర్పాట్లను నిర్వహకులు భారీ ఎత్తున చేపట్టారు.
15 మంది ప్రొఫెసర్లు, 10 మంది శాస్త్రవేత్తలు, జిల్లా స్థాయి అధికారులు వ్యవ సాయ, అనుబంధ రంగాలపై అవగాహన కల్పించేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆధునిక యంత్రాల సహాయంతో చీడపీడల రక్షణ, నూతన వ్యవసాయ పద్ధతులను రైతులకు వివరించనున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్న దృష్ట్యా రైతు లకు పంటల సాగుపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. వ్యవసాయ పంట లు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, పశుపోషణ, మత్స్యశాఖ, ఉపాధి కల్పన, సేంద్రియ ఎరువులు, విత్తనాలు, ఉద్యానవనం, ఐకేపీ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు, గద్వాల చేనేత పట్టు చీరలు, పట్టు పరిశ్ర మ వంటి 40 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం వరి సాగును తగ్గించాలని చెబుతుండటంతో ప్రత్యామ్నయ పంటల సాగుపై రైతులను చైతన్యం చేసేందుకే రైతు మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. మేళాకు హాజరయ్యే రైతులకు ఉచిత రవాణా సౌకర్యం, భోజ న వసతి కల్పిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులకు అవగాహన కార్యక్రమాలను నిపుణులు, శాస్త్రవే త్తలు, ప్రొఫెసర్లతో శిక్షణ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రైతు మేళాకు చక్కటి ఏర్పాట్లు.. ఎమ్మెల్యే అబ్రహం
పంటల సాగుపై రైతులకు చక్కటి సలహాలు, సూచనలు అందించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న రైతు మేళాకు టీఆర్ఎ స్ రాష్ట్ర సీనియర్ నేత, మాజీ జడ్పీటీసీ తిరుమల్రెడ్డి సహకారంతో ధన్వంతరి వేంకటేశ్వరస్వామి దేవస్థాన కమిటీ చక్కటి ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. మంగళ వారం మండలంలోని ఉత్తనూర్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రైతు మేళాకు చేసిన ఏర్పాట్లను తిరుమల్రెడ్డితో కలిసి పరిశీలించారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని లాభసాటి పంటలు సాగు చేసి ధనవంతులు కావాలనే లక్ష్యంతో పంటల సాగు, ఆధునిక యంత్రాల వాడకంపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రైతుమేళాకు రెండు యూనివర్సిటీలకు చెందిన 15మంది ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొంటారని పేర్కొన్నా రు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా స్థాయి అధికారులు, అలంపూర్ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సి పల్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.