గద్వాల, మే 10 : ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఆయిల్ఫాం సాగుపై రాయితీ కల్పించిం ది. ఇప్పుడు అదే బాటలో మల్బరీ తోటల సాగు చేసేందుకు రైతులకు చేయూతనందిస్తున్నది. 202 2-2023 ఆర్థిక సంవత్సరానికిగానూ సిల్క్ సమగ్ర పథకం కింద మల్బరీ తోటల పెంపకం కోసం ఉద్యానవన, పట్టు పరిశ్రమ వారు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పొలాలకు నీటి వసతి ఉన్న రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పట్టు, ఉ ద్యానవన శాఖ డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నది. ఆసక్తి ఉన్న రైతులు పట్టాదారు పాస్బు క్కు, ఆర్ఓఆర్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్కా ర్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, పాస్ఫొటోలతో ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలి. వివరాల కోసం పట్టు పరిశ్రమ శాఖ అధికారి జానార్దన్ (7997725199), గద్వాల ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాసచారి (7997725197), అలంపూర్ అధికారి రాజశేఖర్ (7997725198)ను సంప్రదించాలి.
జిల్లాకు వంద యూనిట్లు మంజూరు..
ఉద్యానవన పంటలు సాగు చేసే రైతుల కోసం జోగుళాంబ గద్వాల జిల్లాకు పట్టుపరిశ్రమల శాఖ 100 యూనిట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తున్నది. పట్టు పురుగుల పెం పకం షెడ్డు నిర్మాణం వెయ్యి స్కైర్ ఫీట్లలో ఉండా లి. యూనిట్ ధర రూ.4 లక్షలు కాగా.. 50 శాతం రాయితీ ఇస్తున్నది. షెడ్డు నిర్మాణం, తోట నిర్వాహణకు ప్రభుత్వం రూ.2,25,000 రాయితీ కల్పిస్తు న్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 65 శాతం రాయితీ ఇస్తు న్నది. షెడ్డు నిర్మాణానికి రూ.2.60 లక్షలు, తోట నిర్వహణకు రూ.32,500 రాయితీ కల్పిస్తున్నది.
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం మల్బరీ తోటలు సాగు చేసే రైతులకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలపై దృష్టి సారించాలి. పంట సాగు, షెడ్డు నిర్మాణం కోసం సబ్సిడీతోపాటు డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నది.
– సురేశ్, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి, జోగుళాంబ గద్వాల