శ్రీశైలం ఏప్రిల్ 7 : శ్రీశైల మహా క్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయాలైన పంచమఠాలలో విభూధిమఠం రుద్రాక్షమఠం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో బుధవారం అత్యంత పురాతనమైన శాసనాలు బండపరుపుపై బయటపడినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. బుధవారం సాయంత్రం జీర్ణోధారణ పనులు చేస్తున్న సిబ్బందికి రుద్రాక్షమఠానికి ఉత్తరం వైపు ఉన్న పెద్ద బండపరుపుపై పురాతనమైన చిత్రలిపి కలిగిన పలు శాసనాలను పరిశీలించారు. ఈ ప్రాచీన శాసనాలు పూర్వం 1500 నుంచి 300 సంవత్సరాల కిందటివిగా పురావస్తుశాఖ సిబ్బంది ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నారు. ఈ శాసనాలను పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు సాంకేతిక పురావస్తు నిపుణుల బృందా న్ని తక్షణమే పంపించాల్సిందిగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్కు నివేదికలు పంపినట్లు ఈవో తెలిపారు.