ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మక్తల్ టౌన్, ఏప్రిల్ 21 : దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. బుధవారం మక్తల్ పట్టణంలోని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ ఆధ్వర్యంలో యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ నిజాంపాషాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు వరి కొనుగోలు కేంద్రాల వద్దకు ఒకేసారి రాకుండా వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లలో తెలిపిన తేదీల్లో మాత్రమే ధాన్యం తీసుకురావాలన్నారు. తేమ శాతం 17 కన్నా మించకుండా ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా అన్ని సిద్ధం చేయాలన్నారు. ధాన్యం క్వింటా మద్దతు ధర రూ.1,888 అని తెలిపారు. కేంద్రాల వద్దకు రైతుల ఆధార్ కార్డు, పాస్ బుక్కు, ఖాతా జిరాక్స్లను తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనిల్, సెక్రటరీ భారతి, డైరెక్టర్ రాజమహేందర్రెడ్డి, శాలంబిన్ ఉమర్, ప్రమోద్, గోవిందప్ప, కౌన్సిలర్ రాములు, మొగిలప్ప, టీఆర్ఎస్ నాయకులు శేఖర్రెడ్డి, తాయప్ప, కర్రెం కృష్ణ, నేతాజీ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ మండల కేంద్రంలో..
కృష్ణ, ఏప్రిల్ 21 : రైతులు పండించిన ధాన్యాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా వందశాంతం కొనుగోలు చేసి సీఎం కేసీఆర్ రైతులకు మద్దతు ధర అందిస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ చైర్మన్ నిజాంపాషాతో కలిసి ఎమ్మెల్యే చిట్టెం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా ద్వారా రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కు మాత్రమే దక్కుతుందని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కు లు ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణిమ పాటి ల్, జెడ్పీటీసీ అంజనమ్మ పాటిల్, పార్టీ మండలాధ్యక్షుడు విజయప్పగౌడ్, సింగిల్విండో చైర్మన్ వెంకటయ్య, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, టీఆర్ఎస్ నాయకులు శివపాటిల్, మోనేష్, విజయగౌడ్, అశోక్గౌడ్, ఆ యా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.