ఉప్పునుంతల,మే 26: మండలంలోని గ్రామాల్లో చేపట్టిన ఫీవర్ సర్వేను వైద్య సిబ్బంది పక్కాగా నిర్వహించాలని డివిజన్ వైద్యాధికారి శ్రీధర్ సూచించారు. మండలంలోని సదగోడులో క్షేత్రస్థాయిలో సిబ్బంది చేపట్టిన ఫీవర్ సర్వేను బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేవల్ల కరోనా బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. కరోనా బాధితుల ఇండ్లకు వెళ్లి వారికి అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఒళ్లనొప్పులు, దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షాణాలు ఉన్నవారికి కరోనా కిట్లు అందజేసి 5రోజులపాటు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ మలేరియా అధికారి అశోక్ప్రసాద్, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నోడల్ అధికారి పర్యవేక్షణలో..
అమ్రాబాద్, మే 26: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే అమ్రాబాద్, పదర మండలాల్లో ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ సందర్భంగా బుధవారం నోడల్ అధికారి శ్రీకాంత్ స ర్వేను పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ ఫీవర్ వచ్చిన వారు తక్షణమే తమ సిబ్బందికి తెలపాలని, తగు ఆరోగ్య జాగ్రతలు పాటించడంతోపాటు వైద్యుల సలహాలు పాటించాలని కోరారు. అదేవిధం గా సర్వే సజావుగా నిర్వహించేందుకు ప్ర జలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, ఆశ వర్కర్లు, అం గన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.