అయిజ, మార్చి 23 : భగత్సింగ్ ఆశయాల స్ఫూర్తితో యువత నడుచుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి పిలుపునిచ్చారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం వారి చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఈశ్వర్, నాగరాజు, శ్రీనివాసులు, పెద్ద రాముడు, పరశురాముడు, తిరుమలేశ్ పాల్గొన్నారు.
ప్రభావశీల విప్లవకారుడు భగత్సింగ్
గట్టు, మార్చి 23 : భగత్సింగ్ ప్రభావశీల విప్లవకారుడని సీపీఎం నాయకుడు వీవీ నర్సింహ పేర్కొన్నారు. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో భగత్సింగ్ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ముందుగా భగత్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ సామ్యవాద భావాలు కలిగిన భగత్సింగ్ మంచి పోరాట యోధుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కర్రెప్ప, నర్మద, వీరేంద్ర పాల్గొన్నారు.
భగత్సింగ్కు ఘన నివాళి
మల్దకల్, మార్చి 23 : మండల కేంద్రంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం భగత్సింగ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీం పాషా మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సమ సమాజ స్థాపన కోసం పోరాటం సాగించిన విప్లవ యువ కిశోరాలు భగతసింగ్, రాజ్గురు, సుఖదేవ్ల సేవలు మరువలేనివని వారి సేవలు కొనియాడారు. ఉరికొయ్యను ముద్దాడిన వీర కిశోరాలు భగత్సింగ్, రాజ్ గురు, సుఖదేవ్లకు విప్లవ జోహర్లు అని అన్నారు. కార్యక్రమంలో మండల పీడీఎస్యూ ఉపాధ్యక్షుడు రఫీ, అశోక్, సుశాంత్, మహబూబ్, చాంద్ పాల్గొన్నారు.
పీడీఎస్యూ,ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో..
గద్వాల అర్బన్ మార్చి 23 : దేశ సార్వభౌమాధికారం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహ నీయులు భగత్సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్లని పీడీఎస్ యూ , ఐఎఫ్టీయూ సంఘ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మంగళవారం మహనీయుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
భగత్సింగ్ ఆశయాల కోసం కృషిచేయాలి
ఉండవెల్లి, మార్చి 23 : భగత్సింగ్ ఆశయాల కోసం యువత కృషి చేయాలని సీపీఎం మండల అధ్యక్షుడు మద్దిలేటి పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో భగత్సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుంకన్న, సీఐటీయూ నాయకులు వెంకటేశ్వర్లు, నరసింహ, కర్ణాకర్ పాల్గొన్నారు.