ధరూర్, ఏప్రిల్ 20: సీడ్ డ్రిల్ వ్యవసాయ పద్ధతిలో రైతులు వరిసాగు చేస్తే వ్యయం తగ్గించుకోవచ్చని డీఏవో గోవింద్ నాయక్ అన్నారు. మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సీడ్ డ్రిల్ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ పద్ధతి లో వరి సాగు చేస్తే విత్తన మోతాదు తగ్గి నారు పోసుకునే అవసరం ఉండదన్నారు. అలాగే నాటు వేసే కూలీల అవసరం తగ్గి వ్యయం మిగులుతుందన్నారు. నారు బాగా ఎదిగి దిగుబడి అధికంగా వస్తుందన్నారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు సక్రియానాయక్, శాస్త్రవేత్తలు రామకృష్ణబాయి, అర్చన, ఎంఏవో శ్రీలత, ఏఈవోలు నర్సింహులు, కృష్ణయ్య, శివరాజ్, నాగవేణి, స్వరూప, సుభాన్, రోహిత్, సర్పంచ్ పార్వతమ్మ, రైతులు చిన్నరామిరెడ్డి, రంజిత్రెడ్డి, భీంరెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.