ఇన్ఫ్లో 41,028, అవుట్ఫ్లో 242 క్యూసెక్కులు
జూరాలకు వరద తగ్గుముఖం
అయిజ, జూన్ 20 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో వానలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో భారీగా పెరిగింది. జలాశయం ఎగువన ఉన్న శివమొగ్గ, తీర్థహళ్లి, మొరాళ్లు, మలెనాడు ప్రదేశాల్లో వర్షాలు కురుస్తుండటంతో వరద తరలివస్తున్నది. ఆదివారం డ్యాంకు ఇన్ఫ్లో 41,028 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 242 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1596.94 అడుగులకు చేరింది. 100.855 టీఎంసీల నీటిమట్టానికిగానూ ప్రస్తుతం 16.110 టీఎంసీలు నమోదైనట్లు డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
జూరాలకు తగ్గిన వరద
ధరూరు, జూన్ 20 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు వరద తగ్గుముఖం పడుతున్నది. ఆదివారం ఇన్ఫ్లో 1,500 క్యూసెక్కులుగా, అవుట్ఫ్లో 2,627 క్యూసెక్కులుగా నమోదైంది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 540 క్యూసెక్కులు, కుడి కాలువకు 178 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 109 క్యూసెక్కులు ఆవిరిగా నమోదైనట్లు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.498 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.