మండలాల్లో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్ మే 20 : కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. అవసరమైతే మండలాల్లో కొవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ కేర్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలవాలని తాసిల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, వైద్యాధికారులు సమన్వయంతో వ్యవహరించి కొవిడ్ కేర్లను ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత తదితరులు ఉన్నారు.
24న వేలం
కృష్ణా పుష్కరాల సందర్భంగా 201 6లో ఘాట్లు, స్నానపు గదుల కోసం వాడిన సామగ్రికి ఈ నెల 24న కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరం లో వేలం వేయనున్నట్లు కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఈ సామ గ్రి మహబూబ్నగర్ వ్యవసాయ మా ర్కెట్ కమిటీ కార్యాలయం దగ్గర భద్రపర్చడం జరిగిందని, ఈ సామగ్రిని పొందేందుకుగానూ ఆసక్తి ఉన్న వారు 24న సాయంత్రం 4గంటలకు అదన పు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించనున్న వేలంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఆసక్తిగల వారు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా కలెక్టర్ మ హబూబ్నగర్ పేరున రూ.50వేలు డీడీ చెల్లించి వేలంలో పాల్గొనాలని తెలిపారు. వేలంలో పాల్గొనేకంటే ముందుగా భద్రపర్చిన సామగ్రిని ప్రత్యేకంగా పరిశీలించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం https://mahabubnagar.telangana.gov.in./auction/ను సంప్రదించాలని తెలిపారు.