నారాయణపేట టౌన్, మే 19 : పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బుధవా రం పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నారాయణపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ శైలజకు రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా మున్ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహాయ సహకారా లు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇవ్వడం ద్వారా కొవిడ్ బాధితులకు మరో జీవితాన్ని అందించిన వారవుతారన్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిన లయన్స్ క్లబ్ సభ్యులకు డాక్టర్ శైలజ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఎస్పీ చేతన, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెకండ్ వైస్ గవర్నర్ హరినారాయణ భట్టడ్, అధ్యక్షుడు బాలాజీ ఎక్బోటే, ట్రెజరర్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.