అయిజ, మే 16 : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద స్వల్పంగా చేరుతున్నది. ఆదివారం ఎగువన కురుస్తున్న వానలకు తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో 1,823 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, అవుట్ఫ్లో 236 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1584 అడుగులు ఉండగా, 100.855 టీఎంసీల నీటి మట్టానికి గానూ ప్రస్తుతం 6.317 టీఎంసీలు నమోదైనట్లు డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో టీబీ డ్యాం ఎగువన వర్షాలు కురుస్తుండడంతో డ్యాంకు వరద వచ్చి చేరుతుందని ఆయన పేర్కొన్నారు.