రాజాపూర్, జూన్ 14 : గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీపీ సుశీల అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలన్నారు. వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పెద్దఎత్తున మొక్కలు పెంచాలి
హరితహారంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు పెంచాలని ఎంపీపీ సుశీల కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు విత్తనబంతుల తయారీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో విత్తనబంతుల తయారీని వేగవంతం చేయాలన్నారు. వర్షాలు పడిన వెంటనే ప్రభుత్వ భూములు, గుట్టల్లో చల్లాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి సత్యవతి, తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, ఎంపీవో వెంకట్రాములు, ఏపీవో జ్యోతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, రమేశ్నాయక్, నరహరి, సత్యయ్య తదితరులు పాల్గొన్నారు.