భూత్పూర్, మే 13 : కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. గురువారం మున్సిపాలిటీలోని 10వ వార్డులో కరోనా బాధితురాలు, ఆరోగ్యమిత్ర మంజులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా బాధితులు మనోధైర్యం కోల్పోకుండా చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా మారాలని కోరారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని తెలిపారు. శుభకార్యాలకు ఎక్కువ మందిని ఆహ్వానించకుండా నిబంధనల మేరకు జరుపుకోవాలని సూచించారు.
రంజాన్ శుభాకాంక్షలు
మున్సిపాలిటీ కేంద్రంలో ముస్లిం యువకులకు ఎమ్మెల్యే ఆల రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పండుగను ఇండ్లల్లోనే ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, నాయకులు సత్యనారాయణ, అశోక్గౌడ్, రాము పాల్గొన్నారు.