ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్
మహబూబ్నగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సెకండ్ వేవ్ కరోనా విస్తరిస్తున్నందున, లాక్డౌన్లో ప్రజల కు ఇబ్బందులు రానీయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చూడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల ఎమ్మె ల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యారోగ్యశాఖ అధికారులతో లాక్డౌన్, కరోనా కట్టడిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నారాయణపేటలో ఆక్సిజన్ సిలిండర్లు, వైద్యుల కొరత తీర్చాలని మంత్రి ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా మెడికల్ కళాశాల నుంచి ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ ను నారాయణపేటకు కేటాయిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖాన నుంచి నారాయణపేటకు వెంటనే పది సిలిండర్ల ఆక్సిజన్ పంపాలని జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా ఏమాత్రం తగ్గకుండా చూడాలని టీఎస్ఎంఐడీసీ ఎండీతో మంత్రి ఫోన్లో మాడ్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మినీ కొవిడ్ కేర్ సెంటర్ల ద్వారా సేవలందించాలని వైద్యులకు సూచించారు.
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల ప్రభుత్వ దవాఖానల్లో రెమ్డెసివిర్ టీకాకు ఎలాంటి కొరత లేదని.. ఎన్ని కావాలన్నా అందుబాటులో ఉంచుతామన్నారు. నారాయణపేట జిల్లా దవాఖానలో 100 పడకలకు సరిపోయే విధంగా మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో లాక్డౌన్ను పర్యవేక్షించాలన్నారు. అంబులెన్స్ ద్వారా వైద్యుడిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నారాయణ పేటలో ఆక్సిజన్ సిలిండర్ మరమ్మతులకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే లాక్డౌన్ విధించామని.. ప్రతిఒక్కరూ నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ బయటకు రావొద్దన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఆక్సిజన్, పడకలు, రెమ్డెసివిర్ టీకాలు, ఇతర మందులకు ఎలాంటి కొరత లేదన్నారు. వారంరోజుల్లో ఏనుగొండ, వీరన్నపేట, పాత పాతపాలమూరు, టీడీగుట్టలో బస్తీ దవాఖాన ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మహబూబ్నగర్లో 60వెంటిలేటర్ పడకలు
జిల్లాలో 60వెంటిలేటర్లు, సరిపడేంత ఆక్సిజన్ పడకలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. దేవరకద్ర, బాలానగర్, కోయిలకొండలో 50మందికి సరిపడా పడకలతో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఫీవర్ సర్వేలో 2,30,532 గృహాలను సందర్శించారని, 7,582 మంది దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు ఇచ్చినట్లు తెలిపారు. కరోనా కోసం మూడు సంచార వైద్య వాహనాలను ఏర్పాటు చేశామని, కంట్రోల్ రూమ్కి వచ్చిన ఫోన్ కాల్స్ను నమోదు చేసుకొని వైద్య సేవలందిస్తున్నామన్నారు. కరోనా రోగులకు ఓపీ సేవలు ప్రారంభించామన్నారు.
నారాయణపేటలో 64 ఆక్సిజన్ పడకలు
జిల్లాలో 64ఆక్సిజన్ పడకలు ఉన్నాయని, ప్రస్తుతం 42 మంది కరోనా రోగులు ఉండగా, నిత్యం కొత్తగా 10 నుంచి 12మంది వస్తున్నారని కలెక్టర్ హరిచందన తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్ టీకాలు కావాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పేట దవాఖానలో ఆక్సిజన్, డాక్టర్ల కొరత తీర్చాలని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోరారు. అదేవిధంగా లాక్డౌన్, కరోనా పోరుపై దేవరకద్ర, మక్తల్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్పీలు ఆర్ వెంకటేశ్వర్లు, చేతన, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఆర్వో స్వర్ణలత, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, డీఎంహెచ్వో కృష్ణ, జెడ్పీ సీఈవో జ్యోతి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.