నర్సరీని పరిశీలించిన ఎమ్మెల్యే చిట్టెం
మక్తల్ రూరల్, జూన్ 10 : మండలంలోని ఖానాపూర్ గ్రామ శివారులో రాజీవ్ భీమా పంప్హౌస్ వద్ద ఆయుర్వేదిక్ నర్సరీని గురువారం ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్రెడ్డి సంద ర్శించారు. ఆయుర్వేదిక్ ప్లాంట్లో మొక్కలను పరిశీలించారు. మొక్కలను జాగ్రత్తగా పెంచాలని అధికారులకు సూచనలు చేశారు. ఆయుర్వేదిక్ మొక్కల వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయన్నారు. అలాగే అక్కడి నుంచి యాదాద్రి వనాన్ని సందర్శించారు. అతి తక్కవ కాలంలోనే మొక్కలు మంచిగా పెరిగాయని ఎమ్మెల్యే సంతృప్త్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భీమా ప్రాజెక్టు ఎస్ఈ శివ ధర్మతేజ, ఏఈ నాగశివ, టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రాంలింగం, నాయకులు పాల్గొన్నారు.
ప్రసూతి గది ప్రారంభం
కృష్ణ, జూన్ 10 : మాగనూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి గది, ల్యాబొరేటరీ గదిని గురు వారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవం చేయించుకోవాలని సూచించారు. ప్రా రంభోత్సవం అనంతరం ప్రసవించిన తల్లికి కేసీఆర్ కిట్టును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఎంపీపీ శ్యామల, జెడ్పీటీసీ వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, డాక్టర్ శ్రీమంత్, నాయకులు పాల్గొన్నారు.