గద్వాల న్యూటౌన్, నవంబర్ 28: ప్రకృతి వనరులైన గుట్టలు, కుంటలు రోజురోజుకూ అక్రమార్కుల చేతిలో తరిగిపోతున్నాయి. ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెతి చూడకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. రోజూ రాత్రినక, పగలనక గుట్టల నుంచి మట్టిని తరలిస్తూ సోమ్ము చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున దందా కొనసాగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భూ ముల్లో కొందరు అక్రమార్కులు మట్టి కొల్లగొడుతున్నారు. ఇక వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. ఆ ప్లాట్ల చదును కోసం, గృహ నిర్మాణాల పనులకు మట్టిని తరలిస్తున్నారు. వాల్టా చట్టప్రకారం మట్టి తవ్వకానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. ఇం దుకోసం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రైతుల నుంచి పట్టా భూముల నుంచి మట్టిని తరలించినా రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ మట్టి వ్యాపారులు నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఆ యా శాఖలకు రావాల్సిన ఆదాయానికి గం డి కొడుతున్నారు. అక్రమార్కులకు కొందరు ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో మట్టిని దర్జాగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. అక్రమ మట్టి తవ్వకాలు కండ్ల్లముందే జరుగుతున్నా అధికారులు కట్టడి చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దర్జాగా దందా..!
గద్వాల మండలంలోని గద్వాల, గోనుపాడు, లత్తీపురం, వెంకంపేట, చెనుగోనిపల్లిలోని వజ్రాలగుట్ట, జమ్మిచేడు రిజర్వాయర్, నదీ అగ్రహరం, తెలుగోనిపల్లి, ము ల్కల్పల్లి తదితర ప్రాంతాల్లో మట్టి వ్యాపారం జోరుగా సాగుతున్నది. జేసీబీ, ట్రాక్టర్లు, టిప్పర్ల సాయంతో గుట్టలు, ప్రభు త్వ, ప్రైవేట్ భూములను తవ్వేస్తున్నారు. ఉదయం, రాత్రి యంత్రాల సాయంతో మట్టిని అక్రమంగా తరలిస్తూ పెద్దఎత్తున లాభాలు ఆర్జిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ట్రాక్టర్కు రూ. 1500, టిప్పర్కు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇండ్లు, వ్యాపార సముదాయాల నిర్మాణాలు జోరందుకోవడంతో వ్యాపారులు సిండికేట్గా మారుతున్నారు. వీరికి కొందరు పేరుమోసిన వ్యక్తులు బ్రోకర్లుగా వ్యవహరిస్తూ అటు అధికారులు, ఇటు వ్యాపారులకు మధ్య ఉంటూ బేరసారాలు కుదుర్చుతున్నారు. పనిలో పనిగా కొందరు నాయకుల మద్దతూ కూడగట్టుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెం డునెలల్లో కొన్ని చోట్ల ఆడపా దడపా అక్రమంగా మట్టి తరలించే వాహనాలను పట్టుకొని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో వీటికి అడ్డుకట్ట పడాలంటే పోలీస్శాఖ పటిష్ట నిఘా ఉంచడంతోపాటు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
గద్వాల మండలంలోని గుట్టల నుంచి రూ.లక్షల విలువైన మట్టిని తరలిస్తున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. అధికారులు నామమాత్ర కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమార్కులతో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వానికి నయా పైసా చెల్లించకుండా, ఏ ఒక్కశాఖ నుంచి ఎలాం టి అనుమతులు లేకుండానే గుట్టను తవ్వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై మైనింగ్ ఏడీ విజయరామరాజును వివరణ కోరగా అనుమతి లేకుండా మట్టి తరలింపు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టుబడిన సంఘటనలు