మహబూబ్నగర్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. సుమారు 87 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరింత వరద వచ్చే అవకాశం ఉండటంతో గేట్లను ఎత్తి 1,10,556 క్యూసెక్కులు నదిలోకి (శ్రీశైలం వైపు) విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు (318.516 మీటర్లు) కాగా ప్రస్తుతం 6.38 టీఎంలు (316.790 మీటర్లు) గా ఉంది.