గద్వాల: గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధికి నా వంతు చేయూతనందిస్తానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపా రు. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా రూ.80లక్షలతో రోడ్డు ఊడ్చే మిషన్, డోజర్, చెత్తను తీసే లిఫ్ట్ మిషన్లను మున్సిపల్ చైర్మన్ కేశవ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. మున్సిపాలిటీలోని వార్డులను పరిశుభ్రం గా ఉంచడానికి తడి, పొడి చెత్త బుట్టలు ప్రజలకు అందించడం జరిగిందన్నారు.
చెత్తను స్వీకరించడానికి వాహనం ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లపై ఉన్న మట్టి ఇతర వాటిని తొలగించడానికి స్వీపింగ్ యంత్రాన్ని మున్సిపాలీటికి అందించామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డులో పట్టణ ప్రకృతివనం పార్కులు ఏ ర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదన్నారు
పుర కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహాకారాలు అందిస్తాన న్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వ రమ్మ, పురపాలక వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, శ్రీనివాసులు, దౌలు, అన్వర్, నాయకులు రమేశ్నాయిడు, సుధాకర్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.