గద్వాల టౌన్: ఆర్మీ త్యాగాలు వెలకట్ట లేనివని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. దేశ ఆర్మీ త్యాగాలను స్మరి స్తూ, ఇండియన్ ఆర్మీ విజయాలను, యువతలో దేశ భక్తి, సమైక్యత భావాన్ని పెంచేందుకు కల్నల్ లక్ష్మణ్సింగ్ ఆధ్వ ర్యంలో ఇండియన్ ఆర్మీ చేపట్టిన స్వర్ణ విజయ్ వర్ష సైకిల్ యాత్ర మంగళవారం గద్వాలకు చేరుకుంది. యాత్రకు రూరల్ పోలిస్టేషన్ వద్ద ఎమ్మెల్యే, పోలీస్ అధికారులు, విద్యార్థులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
జాతీయ జెండాను ప్రదర్శిస్తూ పట్టణ ప్రదాన రహదారుల గుండా సమైక్యత ర్యాలీ సాగింది. పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్మీ లేనిదే దేశం లేదన్నారు. మనమందరం సంతోషంగా జీవించడానికి కారణం జవాన్లు అన్న విషయాన్ని మరువరాదన్నారు. త్యాగ నిరతికి స్ఫూర్తిగా నిలచిన జవాన్లను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
చారిత్రాత్మక సోమ నాద్రి కోటను ఆర్మీ సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్మీ చేపట్టిన యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎ స్ కేశవ్, డీఎస్పీ రంగస్వామి, ఎస్సైలు, నాయకులు పాల్గొన్నారు.