జోగులాంబ గద్వాల : పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించడానికి ప్రకృతి వనం పార్కులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. గద్వాల పట్టణం లోని 25వ వార్డులలో పట్టణ ప్రగతి లో భాగంగా ఏర్పాటుచేసిన పట్టణ ప్రకృతి వనం పార్కులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు.. గతంలో ఏ ప్రభుత్వానికి రానీ ఆలోచన సీఎం కేసీఆర్కు వచ్చిందన్నారు. పల్లెల్లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి అన్ని రకాల మొక్కలు నాటడంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్రతి వార్డులోని పట్టణ ప్రగతి కార్యక్రమంలో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేసి మొక్కలు నాటుతున్నామన్నారు.
మొక్కలు పెంచడం వల్ల మనకు మంచి ఆక్సిజన్ లభిస్తుంది. పెద్దవారు కూడా వాకింగ్, యోగా, ధ్యానం, చేసే విధంగా ప్రకృతి వనంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు పిల్లలు కూడా ఆడుకునే అన్ని పరికరాలను ఏర్పాటు చేస్తామన్నారు.భవిష్యత్తులో గద్వాల పట్టణం అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు విజయ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి , శ్రీమన్నారాయణ, శ్రీను, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.