మానవపాడు: మన గ్రోమోర్ సెంటర్లో పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పంటరాక నష్టపోయామని రైతు ఫిర్యాదు చేయ డంతో మంగళవారం సాయంత్రం ఏడీఏ సక్రిచా నాయక్, ఏవో శ్వేతతో కలసి ఎమ్యెల్యే ఆ పంట పొలాలను పరిశీలించారు.
మన గ్రోమోర్ సెంటర్ వారు రైతులకు నకిలీ విత్తనాలు ఇవ్వడం వల్ల మాకు పంట రాలేదని విచారణ జరిపించాలని కోరారు. రైతుల ఫిర్యాదుకు స్పందించిన ఎమ్యెల్యే ఏడీఏని అడిగి వివరాలు తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలను రప్పించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
పంట నస్టానికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోండి
మానవపాడు: అమ్మోనియం నైట్రేట్ విడుదలై పంట నష్టానికి కారణం అయిన వారిపై చర్య తీసుకోవాలని ఎమ్యెల్యే మా ర్కెటింగ్, పోలీస్ శాఖ వారిని ఆదేశిం చారు. మంగళవారం జాతీయ రహదిరి పక్కన ఉన్న సాయి చక్ర కోల్డ్ స్టోరేజీ వెనుక ఉన్న బోరవెల్లి సత్యారెడ్డి పొలాన్ని జడ్పీ చైర్ పర్సన్ సరిత, ఎమ్యెల్యే అబ్రహంలు ఒకరి తరువాత ఒకరు పరిశీలించారు.
సాయి చక్ర కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిబంధనలకు విరుద్దంగా కోల్డ్ స్టోరేజీకి వాడే అమోనియం నైట్రేట్ను బయటకు వదిలారని దీంతో పక్కనే ఉన్న పత్తి పంట మొత్తం దెబ్బతిన్నదని ట్రాన్స్ఫార్మర్ కూడా మా పొలంలోనే ఏర్పాటు చేశారని ఎమ్యెల్యేకు పిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎమ్యెల్యే మార్కెటింగ్ శాఖ వారిని, పోలీస్ శాఖ వారితో ఫొన్లో మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీ వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.