ఉండవెల్లి: ఆధైర్య పడకండి ప్రభుత్వం అండగా ఉంటుందని కొత్తపల్లి బాధిత పిల్లలకు ఎమ్మెల్యే అబ్రహం హామీ ఇచ్చారు. అయిజ మండలం కొత్తపల్లి గ్రామంలో వర్షానికి గోడ కూలి ఐదుగురు మృతి చెందగా ఇద్దరు చిన్నారులు కర్నూలు ప్రభు త్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
దీంతో ఎమ్మెల్యే కర్నూలు ప్రభుత్వ దవాఖానకు వెళ్లి పిల్లలను పరామర్శిం చారు. అనంతరం పిల్లల ఆరోగ్య పరిస్థితిపై హెడ్ఆఫ్ డిపార్ట్మెంట్ ఆర్థో చిఫ్ డాక్టర్ శ్రీనివాస్తో ఎమ్మెల్యే అబ్రహం చర్చించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ గోపాల్ కృష్ణయాదవ్, కొత్తపల్లి గ్రామపెద్దలు ఉన్నారు.