ఉండవెల్లి: దళిత బంధు పథకంను నిలిపివేయడంపై మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే అబ్రహం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, దళిత నాయకులు ర్యాలీగా చౌరస్తా కూడలికి చేరుకుని కేంద్ర ప్రభు త్వ వైఖరికి నిరసనగా నినాదాలతో ధర్నా చేసి దిష్టిబొమ్మను దహానం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దళి తుల బ్రతుకులను బాగు చేయడం కోసం దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఆమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తెలంగాణ పథకాలను ఆమలు కా కుండా చేస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాయకుల ఆరచాకాలు రోజురోజుకు శృతి మించిపోతున్నాయన్నారు.
హుజురాబాద్లో జరిగే ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు దళితబంధు పథకంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యా దు చేసి నిలిపియడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే అబ్రహం ప్రశ్నించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేయని అనేక ప్రజాసంక్షేమ పథకాలను ఆమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ఆమలు కాకుండా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు.
స్వాతంత్రం వచ్చి ఎనిమిది దశబ్దాలు అవుతున్న దళితుల అభ్యన్నతి కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను ఆమలు చేయలేదు బీజేపీ ప్రభుత్వం. దళితుల ఆర్థిక, సామాజిక అభి వృద్ధికి వ్యతిరేకి అయిన బీజేపీ పార్టీని బొంద పెట్టేందుకే హుజురాబాద్తో పాటు రాష్ట్రంలోని దళిత ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం తనయుడు ఆజయ్, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాల్ చైర్మన్లు మనోరమ్మ, చిన్నదేవన్న, కరుణశ్రీ, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బైరాపురం రమణ టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.