జోగులాంబ గద్వాల : పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి పార్కుల నిర్మాణం చేపట్టినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సంఘాల చెరువు సమీపంలో నిర్మిస్తున్న పార్కును ఎమ్మెల్యే పురపాలక చైర్మన్ కేశవ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అలసిపోయిన పట్టణ ప్రజలు ప్రశాంతంగా సేదతీరడానికి ఈ పార్కులు ఉపయోగపడతాయని తెలిపారు.
త్వరలో దీనిని ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ సేవలు మరిచిపోలేనివన్నారు. తెలంగాణ సమాజం ఆయన సేవలను ఎప్పటికి గుర్తుంచుకుంటుందన్నారు.
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్