మక్తల్ రూరల్: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మక్తల్ పట్టణంలో ఎమ్మెల్యే స్వగృహంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ మండల కార్యవర ్గం ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత పట్టిష్టం చేయడానికి కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని ఆయన తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వంపై ప్రతి పక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యే చిట్టెం పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతుబంధు, దళితబంధు, రైతు భీమా, వృద్దాప్య పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల వల్ల ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు.
నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందన్నారు. సమావేశంలో మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాలమ్, శంషుద్దీన్, మాజీ ప్రజా ప్రతినిధులు చంద్ర కాంత్గౌడ్, నరసింహాగౌడ్, వెంకటేశ్, శ్రీహరి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నా రు .