అయిజ: కర్ణాటకలోని టీబీ డ్యాం జలకళను సంతరించుకున్నది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతుండడంతో పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 15,789 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 15,307 క్యూసెక్కులు ఉంది.
100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, 1633 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ..
కర్ణాటకలో ఆర్డీఎస్ ఆనకట్ట వరద కొనసాగుతోంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో పాటు రీజనరేట్ నీరు ఆర్డీఎస్ ఆన కట్టకు చేరుతోంది. ఆదివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 17,100 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 16,750 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారే జీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తు తం ఆర్డీఎస్ ఆనకట్టలో 9.5 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.