ఆలస్యంగా వెలుగులోకి ఘటన
విచారణ వేగవంతం చేసిన అధికారులు
పరిశీలించిన తాసిల్దార్, ఎస్సై
మానవపాడు, జూలై 28 : ఇంటి పునాదులు తీస్తుండ గా.. బంగారం నాణేలు బయటపడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. స్థానికుల కథనం మేరకు.. మానవపాడుకు చెందిన జనార్దన్రెడ్డి నూతనంగా ఇంటి నిర్మాణం కోసం పాడుబడిన ఇంటిని రెండు నెలల కిందట చదును చేసే పనిని ఇతరులకు గుత్తకు ఇచ్చాడు. ఈ క్రమంలో 11 మంది కూలీలు మట్టి పనులు చేశారు. రెండ్రోజుల తర్వాత పునాదులు తీస్తుండగా.. చిన్నపాటి మట్టికుండ బయటపడింది. ఇందులో చూడగా 100కుపైగా బంగారు నాణేలు ఉన్నట్లు తెలిసింది. వీటిని గుట్టుచప్పుడు కాకుండా 9 మంది 11 చొప్పున పం చుకున్నట్లు సమాచారం. అందులో ఇద్దరికి వాటా అందకపోవడంతో ఈ విషయం మంగళవారం బయటకు వచ్చిం ది. వెంటనే అప్రమత్తమైన తాసిల్దార్ వరలక్ష్మి, ఎస్సై సం తోష్ బుధవారం జనార్దన్రెడ్డి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టా రు. అయితే నాణేలు దొరికిన విషయం తనకు మొదటగా తె లియదని, పంపకాల్లో తేడా రావడంతో బయటి వ్యక్తుల ద్వారా తెలిసిందని జనార్దన్ చెప్పారు. కూలీలను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.