న్యూఢిల్లీ: ఆకాశంలో మరో ఖగోళ అద్భుతం చోటుచేసుకోనున్నది. ఖగోళంలో భూమికి అత్యంత సమీపంలో ఉన్న శుక్ర, అంగారక గ్రహాలు ఈ నెల 13న పరస్పరం మరింత దగ్గరగా వచ్చి ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. అంతకుముందు రోజు అంటే ఈ నెల 12న ఆ గ్రహాలకు దగ్గరగా చందమామ కూడా దర్శనమివ్వనుంది. ఎలాంటి సాధనాలు అవసరం లేకుండా కంటితో నేరుగా ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఖగోళంలోని ఆయా గ్రహాల కక్ష్యల దృష్ట్యా కొన్ని అరుదైన సందర్భాల్లో ఇలా ఒకదానికొకటి దగ్గరగా వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 13న అంగారకుడు, శుక్రుడు పరస్పరం అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెండు గ్రహాల మధ్య ఎడం 0.5 డిగ్రీల మేర మాత్రమే ఉంటుందని చెప్పారు. ఆ రెండు గ్రహాలు, చంద్రుడు పరస్పరం దగ్గరకు వచ్చే ప్రక్రియ గురువారం నుంచే మొదలవుతుందని, 13న అవి మరింత దగ్గరగా కనిపిస్తాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
‘గిన్నిస్’కు ఎక్కిన గుర్రం బిగ్ జాక్ మృతి..!
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
కీలక నేతలతో ప్రధాని భేటీ రద్దు..!
ముంబైలో 88 బ్లాక్స్తో అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్..!
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!