పథకాల అమలు బాధ్యత అధికారులదే..

అలంపూర్, ఫిబ్రవరి 18 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు బాధ్యత అధికారులదేనని జెడ్పీసీఈవో ముషాయిదాబేగం అన్నారు. మండలంలోని సింగవరం1,2 గ్రామాల్లో ఎంపీడీవో సుగుణ కుమార్తో కలిసి ఆమె గురువారం పర్యటించారు. గ్రామ పంచాయతీల్లో రికార్డులను పరిశీలించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. ఎండిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పారిశుధ్యం, నర్సరీల పెంపకం, రైతు కల్లాల నిర్మాణాలు, మురుగు కాల్వల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి బాధ్యత పంచాయతీ కార్యదర్శులపైనే ఉందని, ప్రజాప్రతినిధులను ప్రోత్సహించి మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటిక , సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాల్లో పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీఈవో చంద్రకళ, ఏపీవో శరత్, ఈసీ రామకృష్ణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- దేశవ్యాప్తంగా 10వేల కంపెనీల మూత.. ఎందుకంటే?!
- చికిత్స పొందుతూ యాసిడ్ దాడి బాధితురాలు మృతి
- మనువాడే వ్యక్తితో స్టైలిష్ ఫొటో దిగిన మెహరీన్
- దేశంలో కొత్తగా 15,388 కొవిడ్ కేసులు
- రైతు ఆందోళనలపై బ్రిటన్ ఎంపీల చర్చ.. ఖండించిన భారత్
- అమ్మమ్మ మాదిరిగా హావభావాలు పలికించిన సితార- వీడియో
- అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్