మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు ఈసారి ఎలా జరగబోతున్నాయో ఊహించుకోవచ్చు. కనీసం నోటిఫికేషన్ కూడా విడుదల కాకుండానే ఏకంగా నలుగురు అధ్యక్ష బరిలో ఉన్నారు. అందరికంటే ముందు ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు మూడు రోజుల కింద ప్రకటించాడు. ఈయన ఎనౌన్స్ చేసిన అనంతరం వెంటవెంటనే మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ తాము కూడా అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఇదంతా ఇలా ఉంటే నటుడు ప్రకాష్ రాజ్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో కొన్ని వర్గాల నుంచి విముఖత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం ఈయన నాన్ లోకల్ కావడం. ముందు నుంచి కూడా ఇదే అంశం హైలెట్ అవుతుందని చాలా మంది విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. అనుకున్నట్లుగానే సీనియర్ నటి కరాటే కళ్యాణి ఈయనపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రకాష్ రాజ్ లొకేషన్లో సహనటులతో సరిగ్గా మాట్లాడరని.. ఒకవేళ మాట్లాడినా కూడా అవమానకరంగా ఉంటుందని కరాటే కళ్యాణి తెలిపింది. అలాంటివాడు అధ్యక్షుడిగా ఉంటా అంటే నేను ఒప్పుకోను అంటుంది ఈమె. కరాటే కళ్యాణి తన మనస్సులో మాట బయట పెట్టింది.. కానీ ఇండస్ట్రీలో చాలా మంది గురించి ఇదే అంటున్నారని కొందరి అభిప్రాయం.
ఎవరేమన్నా కూడా ప్రకాష్ రాజ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఈయనకు చిరంజీవి కుటుంబం సపోర్ట్ ఉంది. మొన్న నాగబాబు మాట్లాడిన తీరు చూస్తే ఇదే అర్థమవుతుంది. అయితే తమిళనాట నడిగర్ సంఘం ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా విశాల్ కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. నువ్వు నాన్ లోకల్ అంటూ టార్గెట్ చేశారు. అయినా కూడా విశాల్ తాను అనుకున్నది సాధించాడు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రకాష్ రాజ్ విషయంలో కూడా నాన్ లోకల్ పాలిటిక్స్ మొదలయ్యాయి అంటూ ఆయన ప్యానల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి ఈ విమర్శలను ప్రకాష్ రాజ్ ఎలా తిప్పి కొడతారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
మా ఎన్నికలు..పుకార్లకు కల్యాణ్రామ్ బ్రేక్
పోటీలో నలుగురు.. రసవత్తరంగా మారనున్న ‘మా’ఎన్నికలు
టీకా పేరుతో హీరోయిన్ని బోల్తా కొట్టించిన కేటుగాడు