డబ్బుఇవ్వలేదని తల్లిదండ్రులు, నానమ్మ, చెల్లి హత్య
మాల్దా, జూన్ 19: అడిగిన డబ్బు ఇవ్వలేదన్న కోపంతో కని పెంచిన తల్లిదండ్రులను కొడుకే కడతేర్చాడు. చెల్లిని, నానమ్మను కూడా చంపేశాడు. అందరికీ నిద్రమాత్రలు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత నీళ్లతొట్టిలో ముంచి చంపాడు. మృతదేహాలను పెరట్లో పాతిపెట్టాడు. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాలోని గురుటోలా గ్రామంలో ఫిబ్రవరిలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడు ఆసిఫ్ మొహమ్మద్ (19)ను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడి బారి నుంచి తప్పించుకున్న అతని అన్న ఆరిఫ్ ఇటీవల జరిగిన విషయం చెప్పడంతో ఈ దారుణం బయటపడింది.