హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల వాయిదా వేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ను సవరించి అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి యోచిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారమే ఐసెట్, లాసెట్, ఎడ్సెట్లను జరనున్నట్లు తెలుస్తున్నది. జులై చివరి వారంలో జేఈఈ మెయిన్స్ మూడో పరీక్ష జరిగే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.