యాచారం, జూన్12: మండలంలోని మేడిపల్లి గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శని వారం గ్రామంలో కరోనా పరీక్షల స్పెషల్ క్యాంపును నిర్వ హించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్యాంపులో 100మందికి టెస్టులు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న క్యాంపును డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి పరిశీలించారు. టెస్టులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు పెరు గుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మా స్కులు, శానిటైజర్లు వాడాలన్నారు. గ్రామంలో వ్యక్తిగత పరి శుభ్రతతో పాటు, పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. ఊరం తా శానిటైజేషన్ చేయించాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఆమె సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథ మిక ఆరోగ్య కేం ద్రంలో 91 మందికి టెస్టులు నిర్వహించగా 5 గురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇందులో చింతపట్ల-1, తమ్మలోనిగూడ-2, చౌదర్పల్లి-2 పాజిటివ్ కేసులు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, హెచ్సీవో శ్రీనివాస్రెడ్డి, ఏఎన్ఎం జయమ్మ, వార్డు సభ్యులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కొనసాగుతున్న కరోనా పరీక్షలు
ఆమనగల్లు, జూన్ 12 : ఆమనగల్లు క్లస్టర్ పరిధిలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభు త్వ దవాఖానలో 201 మందికి పరీక్షలు చేయగా 7 పాజిటివ్ కేసు లు, తలకొండపల్లి మండలంలో 182 మందికి పరీక్షలు చేయగా రెండు, గట్టిప్పలపల్లిలో 203 మందికి పరీక్షలు చేయగా 2 పాజిటివ్, మాడ్గులల్లో 72 మందికి పరీక్షలు చేయగా 5 పాజిటివ్, ఇర్విన్లో 15 మందికి పరీక్షలు చేయగా 1 పాజిటివ్ నమోదు అయ్యా యి. జ్వరసర్వేపై ప్రత్యేక దృష్టిపెట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగం చేయడంతో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రజల్లో కూడా పూర్తిగా అవగాహన పెరగడంతో మాస్కు ధరించి , భౌతిక దూరం పాటిస్తున్నారు.