ఘట్కేసర్,జూన్8: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఆర్థ్దిక చేయూతను ఇస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని దేవరప్పకు రూ.2లక్షలు,కల్యాణ్ రూ.40 వేలు, అనిల్ కుమార్ రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు. కార్య క్రమంలో వైస్ చైర్మన్ రెడ్యానాయక్, నాయకులు శేఖర్, శ్రీనివాస్,లబ్ధిదారులు పాల్గొన్నారు.
శామీర్పేట, జూన్ 8: సీఎం సహాయ నిధి కింద జగ్గంగూడ గ్రామానికి చెందిన రాజుకు మంజూరైన చెక్కును మంగళవారం టీఆర్ఎస్ నాయకుడు మురళీగౌడ్ అందజేశారు. కార్యక్రమంలో కుమార్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.