మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. మంగళవారం కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపించారు.
ఒకప్పుడు మనకు చేపలు కావాలంటే బయటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్ల ఇప్పుడు సొంతూళ్లలోనే చేపల పెంపకం జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగింది. ఇతర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది. కానీ ఈసారి కరోనా లాక్డౌన్ ప్రభావంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోయి, స్థానికంగా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రవ్వులు, బొచ్చె, బంగారు తీగ రకాలు అయితే కిలో రూ.100 నుంచి రూ.130 వరకు అమ్ముతున్నారు. జెల్లలు, బొమ్మెలను కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి