మహబూబ్నగర్ : జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేయబోయే 20 పడకల కొవిడ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మా రెడ్డి పరిశీలించారు. దవాఖాన ఆవరణ శుభ్రంగా ఉండేలా చూడాలని డాక్టర్లకు సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకో రావాలని ఎమ్మెల్యే అన్నారు. దవాఖాన వచ్చిన రోగులకు పూర్తి స్థాయి మెడికల్ కిట్ లను అందుబాటులో ఉంచుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
20 పడుకల ఆక్సిజన్ కొవిడ్ సెంటర్ ఈ వారంలో అందుబాటులో కి వస్తుందని, ఎవరైనా కొవిడ్ బారిన పడిన రోగులు జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో చేరవచ్చని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. అలాగే కరోనా నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలన్నారు. ప్రజలు భౌతిక దూరంతో పాటు మాస్కులు ధరించాలన్నారు.
అంతకుముందు 20వ వార్డులోని ఆర్కే ఫంక్షన్ హాల్ ఏరియాలో రూ.5.00 లక్షలతో నూతన అండర్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లకుంట దగ్గర నిర్మిస్తున్న అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు.
పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తదుపరి నూతనంగా నిర్మితమువుతున్న 100 పడకల ప్రభుత్వ దవాఖాన బిల్డింగ్ ను సందర్శించారు. పనులు త్వరగా పూర్తిచేయాలని త్వరలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి