ముమ్మరంగా బీటీ రహదారి పనులు

అయిజ : ఉప్పల రహదారి నుంచి పోలీస్స్టేషన్ వరకు టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. 2.50కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీ రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పలదొడ్డిపేట మీదుగా ఉప్పల గ్రామ రహదారి వరకు సీసీ రోడ్డు, కల్వర్టుతోపాటు బీటీ రహదారి పనులకు గతంలో ఎమ్మెల్యే అబ్రహం భూమిపూజ చేసి పనులు ప్రారం భించారు. కరోనా నేపథ్యంలో పనులు కొంత మేరకు ఆలస్యమైనా ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఇన్చార్జి కమిషనర్ గోపాల్ పర్యవేక్షణలో ఏఈ సురేశ్ బీటీ రహదారి పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించి రోడ్డు పనులు చేపడుతున్నారు. ఉప్పల రహదారి నుంచి పోలీస్ స్టేషన్ వరకు చేపడుతున్న రహదారి నిర్మాణంతో పట్టణ ప్రజలు కర్నూల్, రాయిచూర్ పట్టణాలకు వెళ్లేందుకు సౌలభ్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గుత్తేదారు కృష్ణమూర్తి బీటీ రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేస్తుండటంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- క్రిప్టో కరెన్సీల్లో రికార్డు: బిట్ కాయిన్ 6% డౌన్.. ఎందుకో తెలుసా!
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో