న్యూఢిల్లీ, మే 25: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ నెలలో ఇది 13వసారి కావటం విశేషం. మంగళవారం లీటరు పెట్రోల్పై 23 పైసలు, డీజిల్పై 25 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.99.71కి పెరుగగా.. డీజిల్ ధర రూ.91.57కి చేరింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిన విషయం తెలిసిందే. 13 సార్లు పెరిగిన ఇంధన ధరలను కలిపి లెక్కిస్తే లీటరు పెట్రోల్పై రూ.3.04, డీజిల్పై రూ.3.59 పెరిగింది.