రామాయంపేట, మే 23: లాక్ డౌన్ నిబం ధనలు పాటించాలని ఉదయం 10 గంటలు దాటితే ఎవ్వరూ బయటకు వచ్చి నా వాహనంతో పాటు కేసులు, జరిమానా లు విధించక తప్పదని రామాయంపేట సీ ఐ నాగార్జునగౌడ్ అన్నారు. ఆదివారం రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట చౌరస్తా, పాత జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేశారు.
లాక్డౌన్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని రామాయంపేట కమిషనర్ శ్రీనివాస్ మటన్, చికెన్ దుకాణదారులను హెచ్చరించారు. ఆదివారం మా ంసం విక్రయాయ దుకాణాలను తనిఖీ చేశా రు. మాస్క్లు పెట్టుకొ ని విక్రయాలు జరుపాలని సూచి ంచారు. కమిషనర్ వెంట సిబ్బంది కాలేరు ప్రసాద్, నవాత్ ప్రసాద్, పద్మ, అర్జు న్, శంకర్, బల్ల శ్రీనివాస్ ఉన్నారు.
నర్సాపూర్లో…
నర్సాపూర్, మే 23 : నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతుంది. నర్సాపూర్ పట్టణంలో 16 వాహనాలను సీజ్ చేయడంతోపాటు 23 మంది వాహనదారులకు జరిమా నా విధించినట్టు ఎస్సై గంగరాజు తెలిపారు. చిలిపిచెడ్, కొల్చారం, కౌడిపల్లి, వెల్దుర్తి, మాసాయిపేట్ మండలాల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకే దుకాణాలు మూసివేయడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
చేగుంట..
చేగుంట, మే 23 : ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్ల పైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసి జరిమానా విధిం చారు.
అత్యవసరమైతే బయటకు రావాలి
కొల్చారం, మే 23 : అత్యవసరమైతేనే బ యటకు రావాలని వాహనదారులకు ఎస్సై శ్రీనివాస్గౌడ్ సూచించారు. కొల్చారం పొలీస్స్టేషన్ ఎదుట ఆదివారం ఉదయం 10 గంటలు తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సం దర్భం గా ఎస్సై మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు.