హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే ఇంటర్ సెకండియర్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. తాజాగా టైప్ రైటింగ్, షార్ట్హ్యాండ్ పరీక్షలను పోస్ట్పోన్ చేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 26, 27న టైప్ రైటింగ్, జూలై 3, 4న షార్ట్హ్యాండ్ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. అయితే లాక్డౌన్ వల్ల ఈ పరీక్షలను జూలై 17, 18, 24, 25న నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి