భోపాల్ : మాస్కు ధరించని ఓ మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. రాహ్లీ టౌన్లో ఓ మహిళ మాస్కు ధరించకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. దీంతో ఆమెను పోలీసులు ఆపి ప్రశ్నించారు. ఆమెను జీపులో ఎక్కించేందుకు ప్రయత్నించగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్పై చేయి చేసుకుంది సదరు మహిళ. అనంతరం మహిళా కానిస్టేబుల్తో పాటు మరో పోలీసు ఆ మహిళపై దాడి చేశారు. ఈ తతంగాన్ని చిత్రీకరించిన ఒకరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.