డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో మరోసారి ఆకస్మిక వరదలు నష్టాన్ని కలిగించాయి. గత వారం వచ్చిన వరదల నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో ఉత్తరాఖండ్లోని తేహ్రీ ప్రాంతం వణికిపోయింది. వరదలకు పెద్ద ఎత్తున ఇండ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి ఉత్తరాఖండ్ గిజగిజలాడుతున్నది. తెహ్రీ జిల్లాలోని దేవ్ప్రయాగ్లో ఆకస్మికంగా కురిసిన వానలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కొవిడ్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలను మూసివేశారు. దాంతో ప్రాణ నష్టం జరగలేదు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వాతావరణం మారిపోయి కొండలపై వర్షం పడుతున్నది. తేహ్రీ దేవ్ప్రయాగ్లో ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో ఇండ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాల కారణంగా దేవ్ప్రయాగ్లో చాలా నష్టాన్ని మిగిల్చింది. సాయంత్రం 5 గంటల నుంచి ఏకధాటి వర్షం కురుస్తున్నది. వర్షం నీటికి బురద లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లకు చేరుతుండటంతో ప్రజలు ఇండ్లలో ఉండలేకపోతున్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎస్డీఆర్ఎఫ్ జట్లను అందుబాటులో ఉంచినట్లు డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.
అంతకుముందు ఈ నెల 6 న ఆకస్మిక వర్షాల కారణంగా ఘన్సాలీ, జఖానిధర్ బ్లాక్స్ చాలా నష్టపోయాయి. అనేక హెక్టార్ల భూమి కొట్టుకుపోగా.. అనేక వాహనాలను ఘన్సాలీ మార్కెట్లో శిధిలాల కింద పూడ్చిపెట్టుకునిపోయాయి.
1.41 బిలియన్లకు చైనా జనాభా.. రానున్న రోజుల్లో కష్టాలు తప్పవా..?!
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
క్వాడ్లో చేరడంపై బంగ్లాదేశ్ను హెచ్చరించిన చైనా
తుపాకులను నియంత్రించాల్సిందే: పుతిన్
పర్షియన్ గల్ఫ్లో యూఎస్-ఇరాన్ మళ్లీ ముఖాముఖి
10 వేల మందికి బయో బబుల్ సాధ్యమేనా? : సెరెనా విలియమ్స్
రష్యాలో పాఠశాలపై కాల్పులు: 13 మంది దుర్మరణం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..