పెద్దపల్లి : కరోనాతో చనిపోతే తన అంత్యక్రియలు చేసేందుకు ముందుకురారని భయాందోళన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కామన్పూర్ మండలంలోని పెంచికల్పేట నివాసియైన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు గుడిశల లింగయ్య(63) కొవిడ్ బారిన పడ్డాడు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నందున సోమవారం కొవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్గా తేలింది.
దీంతో విపరీతంగా యోచించి మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు తన ఇంటి సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొవిడ్తో మరణిస్తే తన అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రారేమోనని భావించి ఈ చర్యకు పాల్పడ్డట్లుగా సమాచారం. లింగయ్య పదవీ విరమణ అనంతరం సింగరేణి గెస్ట్హౌజ్లోనే కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నాడు.