ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
మక్తల్ టౌన్, మే 9 : మక్తల్ నియోజక వర్గ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని పెద్ద చెరువు పక్క నుంచి రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా పెద్ద చెరువు తూము నుంచి తూము కింద పంటలకు సాగు నీరు వెళ్లే విధంగా తూము పనులు కొనసాగించాలని ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే చిట్టెం ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్ పెద్ద చెరువు నుంచి 500 ఎకరాలు సాగు అవుతుందని తెలిపారు. చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ నుంచి చెరువుకు నీరు అందుతుందని తెలిపారు. ఎండాకాలంలో కూడా చెరువు కింద 500 ఎకరాలు సాగు అయిందని పేర్కొన్నారు. పెద్ద చెరువు పక్క నుంచి హైవే నెంబర్ 167 రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు పనులు కొనసాగుతున్నాయని చెరువు తూముకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనులు కొనసాగించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా తూము పనులు వద్ద ఉండి పనులు సరిచేసుకొవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అదే విధంగా ప్రతిఒక్కరూ మాస్కు ధరిస్తూ భౌతికదూరం పాటించాలని సూచించారు. అదే విధంగా 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కరోనా వాక్సిన్ వేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నియోజక వర్గ అధికారప్రతినిధి రామలింగం పాల్గొన్నారు.