ఢిల్లీ: భారత హాకీ దిగ్గజం రవీందర్ పాల్ సింగ్ (65) కరోనాతో శనివారం కన్నుమూశారు.
గత కొంతకాలంగా ఆయన కరోనాతో బాధపడుతున్నారు. 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో రవీందర్ సభ్యుడు. కరోనా వైరస్ సోకడంతో రవీందర్ ఏప్రిల్ 24న లక్నోలోని వివేకానంద ఆస్పత్రిలో చేరారు.
సింగ్ ఇటీవల వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా నెగెటివ్గా తేలడంతో నాన్-కొవిడ్ వార్డుకు తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్పై ఉంచారు. చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. రవీందర్ సింగ్ మృతిపట్ల క్రీడారంగ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్ రిజుజు సంతాపం తెలిపారు. 1984లో లాస్ ఏంజెల్స్లో జరిగిన ఒలింపిక్స్లోనూ ఆయన పాల్గొన్నారు.