బాలశక్తి పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

గద్వాలటౌన్ : బాలశక్తి, కల్యాణ్ పురస్కారాల కోసం అర్హులైన పిల్లలు, వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ముషాయిదా బేగం సోమవారం ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు క్రీడలు, కళలు తదిత అంశాలలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన పిల్లలకు బాలశక్తి పురస్కారంతోపాటు లక్ష రూపాయల నగదు, మెడల్, సర్టిఫికెట్ను జనవరి 26న ప్రధానమంత్రి చేతులు మీద అందజేయడం జరుగుతుందన్నారు. బాలల అభివృద్ధి, బాలల సంరక్షణ, సంక్షేమంపై విశేష సేవలు అందించిన వ్యక్తులకు లక్ష రూపాయల నగదు, సర్టిఫికెట్, మెడల్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే సంస్థలకు ఐదు లక్షల నగదు, సర్టిఫికెట్, మెడల్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన వారు నేరుగా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
తాజావార్తలు
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని తాకని భానుడి కిరణాలు
- అలియా భట్ ‘గంగూభాయ్’ సినిమాపై చెలరేగిన వివాదం