అనాథ శవానికి అంత్యక్రియలు
నవాబ్పేట, ఏప్రిల్ 27: మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట సర్పంచ్ గోపాల్గౌడ్ అనాథ వృద్ధురాలి శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. 70 ఏండ్ల వృద్ధురాలు గత ఆరునెలలు నవాబ్పేటలో ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ హిందీలో మాట్లాడేదని స్థానికులు చెప్పారు. నాటినుంచి భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేది. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం అర్ధరాత్రి స్థానిక ఉన్నత పాఠశాల ముందు ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో మృతి చెందింది. శవాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో మానవత్వంతో స్పందించిన సర్పంచ్ గోపాల్గౌడ్, వార్డు సభ్యులు మంగళవారం మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.