న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,49,691 కేసులు నమోదు కాగా.. మరో 2767 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 2,17,113 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. కోలుకున్న వారు 1,40,85,110 మంది కాగా.. 1,92,311 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,82,751గా ఉంది. ఇక ఇప్పటి వరకూ మొత్తం 14,09,16,417 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.