దర్శక దిగ్గజం శంకర్ సినిమాలకు దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో సరైన హిట్స్ లేక డిప్రెషన్లో ఉన్న శంకర్ మంచి హిట్ కొట్టి మళ్లీ పాత ఫాంను అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇటీవలే భారతయుడు 2 చిత్ర షూటింగ్ మొదలు పెట్టి మధ్యలో ఆపేశాడు. ఇక రీసెంట్గా రామ్ చరణ్తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అతి త్వరలోనే ప్రాజెక్ట్కు సంబంధించి పూర్తి డీటైల్స్ వెల్లడించనున్నారు.
ఇదిలా ఉంటే పదహారేళ్ల క్రితం తెరకెక్కించిన అపరిచితుడు హిందీ రీమేక్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు శంకర్. ఈ సినిమా ప్రకటించిన తర్వాతి రోజే నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్తో వివాదంలో చిక్కుకున్నాడు. సినిమాకు కథకు సంబంధించి లీగల్ నోటీసులు అందుకున్నా, తగ్గేదే లే అంటున్నాడు శంకర్. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని కథానాయికగా ఎంపిక చేశారని త్వరలోనే ఆమెపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఎన్ని వివాదాలు ఉన్నా కూడా శంకర్ తన పని తాను చేసుకుపోతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.