నల్లగొండ : ఆర్యవైశ్యులకు అండగా నిలిచింది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురుంచి ప్రజలకు వివరించారు. అదేవిధంగా ఆర్యవైశ్యులకు అండగా నిలిచింది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని వివరించారు. కారు గుర్తుకు ఓటేసి నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు.